కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధుల వరకు అందరూ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. తనకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయ్యిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఐదు రోజుల క్రితం రాజ్నాథ్ వాయుసేన అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ చీఫ్ రాజ్నాథ్ను కలిసి నివేదిక సమర్పించారు.