బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాజకీయ నేతలు సైతం పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని నడ్డా వెల్లడిరచారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.