అమెరికా కరోనా వైరస్ వ్యాక్సిన్ డేటా పై చైనా సైబర్ దాడి
అమెరికన్ న్యాయవాద శాఖ మంగళవారం 21 జూలై న ఇదరు చైనా హ్యాకర్లను అమెరికన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ లో భాగం ఐన కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపించింది. అమెరికన్ న్యాయవాద శాఖ అధికారులు నిందితులను మిళిత ముప్పుగా పిలిచారు మరియు ఈ నెల మొదట్లో వారిపై నేరారోపణలు జరిగాయని, మంగళవారం 21 జూలై అది నిరూపించబడింది మరియు వారు కొన్నిసార్లు చైనా తరపున గూఢచారులు గా పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అని అధికారులు తెలిపారు. చైనా గూఢచారుల సమస్త యొక్క ఆదేశాల మేరకు, ఈ ఇద్దరు హ్యాకర్లు ఈ సంవత్సరం తమ దృష్టిని వ్యాక్సిన్ పరిశోధన మరియు కరోనా వైరస్ గురించి ఇతర సమాచారాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నారని అమెరికన్ ప్రభుత్వ అధికారులు తెలిపినట్టు తెలిసింది.













