GTA: ఘనంగా జీటీఏ మెగా కన్వెన్షన్ 2025.. హాజరైన ప్రముఖులు
హైదరాబాద్: హైదరాబాద్లోని గండిపేట మండలం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్షయ కన్వెన్షన్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జీటీఏ మెగా కన్వెన్షన్-2025 వేడుకలు రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా డిసెంబర్ 27, 28 తేదీలలో జరిగిన ఈ మహాసభలు తెలంగాణ సంస్కృతిని, ప్రవాసుల మేధోశక్తిని చాటిచెప్పాయి. ఈ వేడుకల్లో ఆధ్యాత్మిక దిగ్గజాలు త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
నిర్వాహక బృందం.. లక్ష్యం
ఈ కార్యక్రమం కేవలం వేడుక మాత్రమే కాదని, తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే ఒక మహోద్యమమని జీటీఏ ఫౌండర్, గ్లోబల్ చైర్మన్ కలువల విశ్వేశ్వరరెడ్డి, ఇండియా ఛైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సభల నిర్వహణలో జీటీఏ యూఎస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి కేశిరెడ్డి, జీటీఏ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ రెడ్డి పాడూరు, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి కీలక భూమిక పోషించారు. దాదాపు 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ షో నిర్వహించారు. రియల్ ఎస్టేట్, స్టార్టప్లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద – రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, జీటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్ ఘనంగా జరిగాయి.
అంతర్జాతీయ ప్రాతినిధ్యం: ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మంది ప్రతినిధులు ఈ సభలకు తరలివచ్చారు.
సాంస్కృతిక ప్రదర్శనలు: 100 మందికి పైగా కళాకారులతో జానపద, శాస్త్రీయ కళారూపాలను ప్రదర్శించారు. సింగర్ మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రదర్శనలు, ఆహా ఇండియన్ ఐడల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణ రుచులు: అతిథుల కోసం 35 రకాల నోరూరించే తెలంగాణ వంటకాలను వడ్డించారు. ఫ్యాషన్ షో ద్వారా తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించారు.
భవిష్యత్తు విజన్, చర్చలు
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కింద రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం, గ్లోబల్ భాగస్వామ్యంపై లోతైన చర్చలు జరిగాయి. రియల్ ఎస్టేట్, స్టార్టప్లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానం, జీటీఏ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్తో ఈ మెగా కన్వెన్షన్ ఘనంగా ముగిసింది. తెలంగాణ బిడ్డలందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన ఈ మహాసభలు విజయవంతమయ్యాయని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.






