ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టిన ప్రశ్న? ఆయన సన్నిహితుల గురించేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయడానికి మేకర్స్ సన్నద్ధంగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ శరవేగంగా జరుగుతున్నాయి. నిన్న ముంబై , చెన్నై లో ఈ రోజు శనివారం హైదరాబాద్లో మీడియా సమావేశం జరిగింది. అంతా బాగానే జరిగింది. అయితే ఓ ప్రశ్న మాత్రం ఎన్టీఆర్ను తెగ ఇబ్బంది పెట్టింది. ఆయన కూడా సీరియస్గా మారిపోయారు. అయితే ఓ ప్రశ్న మాత్రం ఎన్టీఆర్ను తెగ ఇబ్బంది పెట్టింది. ఆయన కూడా సీరియస్గా మారిపోయారు. అయితే స్టేజ్పై ఉన్నారనే కారణంతో ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే అంత వరకు నవ్వుతూ ఉన్న ఆయన ముఖం మాత్రం అదోలా పెట్టేశారు. అసలు ఎన్టీఆర్ను అంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటి? అనే సందేహం రాక మానదు.. అసలేం జరిగిందంటే… వివరాల్లోకి వెళితే…
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల గురించి అడుగుతున్న మీడియా ప్రతినిధులు టికెట్ రేట్స్ గురించి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ తగ్గించడం గురించి ప్రశ్నించారు. అది కూడా నిర్మాత దానయ్యను. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆంధ్ర ప్రదేశ్లో ఎన్టీఆర్ స్నేహితులు ఇద్దరూ (కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఉద్దేశించే అనేది) మంచి పోజిషన్లో ఉన్నారుగా మరి తగ్గించిన టికెట్ రేట్స్ విషయంలో ఏంచేద్దామనుకుంటున్నారు? అని ప్రశ్నను వేశారు.
అయితే మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య స్పందిస్తూ టికెట్ రేట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్గా తారక్, అల్లూరి పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఇంకా ఆలియా భట్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ స్టార్స్ సహా రే స్టీవెన్ సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. ఎంటైర్ ఇండియా ఆర్ ఆర్ ఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 1920 బ్యాక్డ్రాప్లో నడిచే ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగాఆర్ ఆర్ ఆర్ నాలుగు వందల కోట్ల బడ్జెట్తో రాజమౌళి తెరకెక్కించారు. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా ఇది.













