Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి.
తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, యూనిట్ సభ్యులు నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్లో అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్లపై ఒక అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు.ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
బుచ్చిబాబు సానా అత్యంత ప్రెస్టీజియస్ తెరకెకీస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ను పూర్తిగా కొత్త లుక్లో, ఇప్పటివరకూ ఎన్నడూ చూడని గెటప్లతో ప్రజెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం కంప్లీట్ మేకోవర్స్ అవుతూ హై ఆక్టేన్ స్టంట్స్ చేయబోతున్నారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఆర్. రత్నవేలు, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్,
‘పెద్ది’ చిత్రం 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కి సిద్ధమవుతోంది.







