ఆస్ట్రేలియా-భారత్ బంధాలను బలోపేతం చేసుకుందాం
వాషింగ్టన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్తో సమావేశమయ్యారు. భారత్`ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సంబంధాలతోపాటు ఇరు దేశాల ప్రజల నడుమ బంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందఠరేగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. ఆస్ట్రేలియాతో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో ఇది మరొక అధ్యాయమని విదేశాంగ శాఖ ప్రతినిధి బాగ్చీ అన్నారు. కోవిడ్%–%19, వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నారని వెల్లడిరచారు. ఆకస్(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) భద్రతా భాగస్వామ్యం ఏర్పాటైన తర్వాత మోదీ, మోరిసన్ భేటీ కావడం ఇదే తొలిసారి.






