The Monk who became the Chief Minister written by Shantanu Gupta book release
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ఉన్న వ్యక్తి అని ప్రజ్ఞాభారతి ఛైర్మన్ హనుమాన్ చౌదరి ప్రశంసించారు. ది మాంక్ హూ బికేం సీఎం అనే పుస్తకాన్ని హనుమాన్ చౌదరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శంహనుగుప్తతో పాటు సంస్కృతి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డా.వంశీ తిలక్ , సినీ డైరక్టర్ మధురా శ్రీధర్ రెడ్డి, రచయిత్రి శ్వేత, వివేక్ మోడీ , సందీప్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హనుమాన్ చౌదరి మాట్లాడుతూ, ఒక మంచి పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చినందుకు శంహనుగుప్తను అభినందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అజయ్ ఎలా ఆదిత్యనాథ్య గా మారారో పుస్తకంలో సవివరంగా వివరించారన్నారు.
ప్రముఖ చిత్ర దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ, మనం ఇలాంటి రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను మరిన్ని రూపొందించాలి. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర తర్వాత అంత పెద్ద బయోపిక్స్ మరే రాజకీయ నాయకుడిపై రాలేదన్నారు. జనాలు బాగా వాటికి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే వాటిని సినిమాలుగా మార్చాలి. ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి రావడం, ఆయా వ్యక్తులకు సంబంధించిన వారి నుంచి పర్మిషన్ తీసుకోవడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ జీవిత చరిత్రలను ప్రజలు నిరాకరించారు. మోడీ, యోగి, కేసీఆర్ ల బయోపిక్స్ లు సినిమాలు గా మారనున్నాయి.
హైదరాబాద్ అనేది తన జీవితంలో చాలా ప్రముఖమైన స్థలమని, హైదరాబాదీ అమ్మాయిని వివాహమాడి, 2001లో హైదరాబాద్ లోనే తన వృత్తిని ప్రారంభించాడు. 2009లో ఒక ఎన్జీవో తో నంది ఫౌండేషన్ అనే ఒక సామాజిక వృత్తిని కూడా ప్రారంభించాడు.యోగి ఆదిత్యనాథ్ పై సందీప్ మొట్ట మరియు సామాజిక కార్యకర్త వంషా తిలక్ కూడా ఆలోచనలను వ్యక్తం చేశారు. యోగి మోడీ పోలిక గురించి శంహను మాట్లాడుతూ, ఇద్దరి బాగా ప్రాచుర్యం పొందారని, శ్రామికులుగా ఉన్నారని శంహనుగుప్త తెలిపారు.













