సీఎం రేవంత్ సొంత నియోజకవర్గానికి… రూ.75 కోట్లు మంజూరు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.45 కోట్లు మంజూరు చేసింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాల కోసం రూ.23.45 కోట్లు, బొమ్మరసిపేట మండలం బురాన్పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల, కాలేజీ నిర్మాణానికి మరో రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.