తెలంగాణలో 6,026 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 6,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 52 మంది మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. తాజాగా వైరస్ నుంచి 6,551 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,115, మేడ్చల్ మల్కాజ్గిరిలో 418, రంగారెడ్డి 403, నల్గొండలో 368 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.