తెలంగాణలో 3,527 కేసులు.. 19 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 97,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకోగా.. 3,226 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో 27,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 92.81 శాతంగా ఉంది. మరణాల రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 519 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం 215 కేసులు చొప్పున నమోదయ్యాయి.