తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 82,270 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8,061 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 56 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం 2,150 మంది మృతి చెందారు. ప్రస్తుతం 72,133 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 5,093 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1,508 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి 673, రంగారెడ్డిలో 514, సంగారెడ్డి 373, మహబూబ్నగర్ 328, నిజామాబాద్లో 291, వరంగల్ అర్బన్లో 203, ఖమ్మంలో 277 కేసులు నమోదు అయ్యాయి.