సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్పై విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. అయితే, తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నికల చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు వెల్లడిరచింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో దండె విఠల్కు ఊటర లభించింది.