మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నేడు జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో తనతో గత కొన్ని రోజుల నుంచి కలిసి తిరిగిన వాళ్లు.. దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.