ఒక అంచనా లేదు, కేంద్రంపై దుమ్మెత్తి పోసిన తెలంగాణా మంత్రి

ఏడాది నుండి కరోన కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది అని ఆయన స్పష్టం చేసారు. అనేక సార్లు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో సూచించిన అనేక అంశాలపై ప్రభుత్వం స్పందించింది అని తెలిపారు. రాష్ట్రం పై కొంతమంది కేంద్ర పెద్దలు చేస్తున్న ఆరోపణలు అర్థ రహితం అని మండిపడ్డారు. కేంద్రం ఇప్పటివరకు కరోన విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఏమీ లేదని అన్నారు.
వ్యాక్సిన్లు , ఇంజక్షన్లు అన్ని కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారు అని మండిపడ్డారు. కేంద్రం చేయాల్సిన తప్పులన్ని చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదు అని హితవు పలికారు. కేంద్రం చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉంటే ఢిల్లీ తో పాటు అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల పై సమాదానం చెప్పాలి అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోన కేసులు , మరణాలపై తప్పుడు వార్తలు వస్తున్నాయి అని అన్నారు. మహారాష్ట్ర , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండి తెలంగాణ పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారు అని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయి అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 19 డయాగ్నోస్టిక్ సెంటర్ల లలో వివిధ పరీక్షలను నిర్వహించేలా సీఎం ఆదేశించారు అని వివరించారు. 19 జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోన బాధితుల కోసం ఈ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులో కి తీసుకొచ్చిందన్నారు. వచ్చేనెలలో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆక్సిజన్ 600 మెట్రిక్ టన్నుల కు పెంచాలని కేంద్రన్ని కోరామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల కేంద్రమే బాధ్యతాయుతంగా ఉండాలి అని హితవు పలికారు.
తెలంగాణ 18 ఏళ్ళు పైబడిన యువకులు 1.7 కోట్ల మంది ఉన్నారన్నారు. వీళ్లకు రెండు డోసుల చొప్పున మూడు కోట్ల డోసులు అవసరం ఉన్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ విషయం లో కేంద్రం మరోసారి పునరాలోచించాలని సూచనలు చేసారు. రెమ్డిసివర్ ఇంజక్షన్ పై కేంద్రం ఇష్టం వచ్చిన రేట్లు పెంచిందని మండిపడ్డారు. మూడు వేల రూపాయలు ఉన్న ఇంజక్షన్ ముప్పై వేలకు అమ్ముతున్నారని విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి అని ఆయన కోరారు. కోవిడ్ విజృంభిస్తున్న విషయాన్ని కేంద్రం అంచనా వేయడం లో విఫలం అయిందని మండిపడ్డారు. అందుకే దేశ వ్యాప్తంగా ఎన్నికలు , కుంభమేళలు నిర్వహిస్తున్నారని విమర్శలు చేసారు.