PASS PORT :మరింత వేగంగా పాస్ పోర్టుల జారీ

పాస్పోర్టుల అపాయింట్మెంట్ విషయంలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం (ఆర్పీవో) అరుదైన మైలురాయిని చేరుకుందని స్థానిక పాస్పోర్టు అధికారిణి స్నేహజ(Snehaja) తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అపాయింట్మెంట్ కోసం 2023 సంవత్సరంలో 22 రోజులు పట్టేదని, పోలీసు(Police), తపాలా శాఖ(Postal Department) ల సహకారంతో 2024లో 6-8 రోజులకు కుదించినట్లు వెల్లడిరచారు.
ఆర్పీవో హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 5 పాస్పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్కే), 14 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు (పీవోపీఎస్కే) పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 2024లో ప్రతిరోజు సగటున 4,200 దరఖాస్తులను పరిశీలించాం. పాస్పోర్టుల జారీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సేవలతో కలిపి 9.02 లక్షల దరఖాస్తులను పరిష్కరించాం. నిజామాబాద్(Nizamabad) లో సాధారణ అపాయింట్మెంట్లను మరుసటి పనిదినంలో, పీవోపీఎస్కేలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. వరంగల్(Warangal)లో అత్యధికంగా రోజుకు 130కిపైగా, మిగాతా కేంద్రాల్లో 90 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి. తత్కాల్ పాస్పోర్టులు 1`3 పనిదినాల్లోనే జారీ చేస్తున్నాం. సాధారణ పాస్పోర్టులన్నీ పోలీసు ధ్రువీకరణ సమయం మినహా 5`7 పనిదినాల్లో జారీ అవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లో ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం. దీని ద్వారా గతేడాది 30 వేల మందికి పైగా నేరుగా సమస్యలు చెప్పుకొన్నారు. మెయిల్స్ ద్వారా వచ్చిన 10 వేలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించాం. సంచార పాస్పోర్టు సేవల కోసం ప్రత్యేక వ్యాన్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. 2025లో ఇంతకంటే ఉత్తమ పనితీరును కొనసాగిస్తాం అని తెలిపారు.