తెలంగాణలో 10 వేలు దాటిన కేసులు…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, 2094 మంది మరణించారు. మరో 69,221 కేసులు యాక్టివ్ ఉన్నాయి. రాష్ట్రంలో 99,638 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో 1449, నల్లగొండలో 469, రంగారెడ్డిలో 621, వరంగల్ అర్బన్లో 653, మహబూబ్నగర్లో 417, నిజామాబాద్లో 498, ఖమ్మంలో 424, కరీంనగర్లో 369, మేడ్చల్ మల్కాజిగిరి 751 చొప్పున నమోదయ్యాయి.