ఉస్మానియాలో 11 మంది వైద్యులకు కరోనా!

తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఉస్మానియాలో విధులు నిర్వహిస్తున్న 11 మంది హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. గత రెండు రోజులుగా హౌస్ సర్జన్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులకు పాజిటివ్ అని తేలింది. దీంతో వారందరిని హోం ఐసోలేషన్ కు తరలించారు.