తెలంగాణలో కొత్తగా 1,489 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గింది. గత 24 గంటల్లో 1,16,252 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,521కి చేరింది. కరోనా బారి నుంచి 24 గంటల్లో 1,436 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,975 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 175 కేసులు నమోదయ్యాయి.