తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,20,525 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.కరోనా బారి నుంచి 2,384 మంది కోలుకున్నారు. 24 గంటల్లో 13 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,469కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కొత్తగా 171 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 5,76,487 మంది డిశ్చార్జ్ అయ్యారు.