తెలంగాణలో కరోనాతో 33 మంది…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,221 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,693 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. రాష్ట్రంలో 6,876 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 33 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,863కి పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు నమోదయ్యాయి.