తెలంగాణలో కొత్తగా 1,088 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,19,466 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,088 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. 24 గంటల్లో కరోనా నుంచి 1,511 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 5,98,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 3,607 మంది మరణించారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి.