తెలంగాణలో కొత్తగా.. 1,362 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,23,005 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 24 గంటల్లో 1,813 మంది బాధితుల డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 3,556 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి.