తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్బులిటెన్లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,005, మేడ్చల్లో 502, రంగారెడ్డి 373, నిజామాబాద్ 406, మహబూబ్నగర్ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.