తెలంగాణలో కరోనా విశ్వరూపం.. 24 గంటల్లో

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,26,235 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4,446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న 12 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి 1,414 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 33,514కి చేరింది. వీరిలో 22,188 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 598, రంగారెడ్డి 326, నిజామాబాద్లో 314 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.