తెలంగాణలో భారీగా తగ్గిన.. కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,36,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 3,346 మంది మరణించారు. కరోనా నుంచి 3,821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 253 కేసులు నమోదయ్యాయి.