శభాష్…లోకేష్.. మంత్రి నారా లోకేష్ భుజం తట్టిన ప్రధాని మోదీ
`నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శభాష్ ..లోకేష్` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేసిన అనంతరం బయలుదేరిన ప్రధానికి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. ఆప్యాయంగా భుజం తట్టిన ప్రధాని.. బాగా పనిచేస్తున్నావు..ఇదే వేగం, స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. గతంలోనూ ఏపీలో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాలు విజయవంతం చేయడం, యోగాంధ్ర రికార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన లోకేష్ కృషిని అప్పట్లో ప్రధాని మెచ్చుకున్నారు.








