కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.2 కోట్లు విరాళం

కొవిడ్ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్లు విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ గోయెల్, వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ రిలేషన్స్) కె.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.