Chandrababu:గూగుల్ క్లౌడ్ సీఈవో తో సీఎం చంద్రబాబు భేటీ

గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ (Thomas Kurien) తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. ఢల్లీిలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) , అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ (Google) తో ఒప్పందం కుదుర్చుకోనుంది. వైజాగ్ను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.