ఏపీలో 18 వేలకు పైగా కేసులు..

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 18,285 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్లో తెలిపింది. 24 గంటల్లో 24,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 99 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో బాధపడుతూ ఇప్పటి వరకు 10,427 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి 14, విజయనగరం 9, అనంతపురం, తూర్పుగోదావరి 8, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. ప్రకాశం, విశా• జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. అలాగే గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాల్లో ఆరుగురు మృతి చెందారు.