ఏపీలో కొత్తగా 22,610 కేసులు… 114 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధ్ధ•తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 22,610 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. తాజాగా మరో 114 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,800కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,134 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,83,42,918 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 23,098 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 12,99,313 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తూర్పుగోదావరిలో 17 మంది, చిత్తూరులో 15 మంది, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 10 మంది, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 9 మంది, కృష్ణ జిల్లాల్లో 8 మంది, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు, నెల్లూరు, శ్రీకాకుళం జిలాల్లో ఐదుగురు, కడపలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.