నిన్న అమర్నాథ్ యాత్ర… నేడు మరో యాత్రకు బ్రేకులు
ఉగ్రవాద ముప్పు కారణంగా అమర్నాథ్ యాత్రను అర్థాంతరంగా నిలిపివేసిన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇవాళ మరో యాత్రకు బ్రేకులు వేసింది. కిష్ట్వార్ జిల్లాలో జరిగే మచేల్మాతా యాత్రను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దుర్గామాత ఆలయం వద్దకు జరిగే మచేల్మాతా యాత్రకు ప్రారంభ స్థానమైన 320 కిలోమీటర్ల దూరంలోని ఉదంపూర్ వద్ద యాత్రికులను నిలిపివేశారు. కిష్ట్వార్ జిల్లాలో దుర్గామాత ఆలయం వద్దకు జరిగే మచైల్ యాత్రను నిలిపివేస్తున్నాం అని కిష్ట్వార్ జిల్లా కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రానా పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను నిలిపివేసిన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం.. భక్తులు తమ యాత్రను కుదించుకుని త్వరగా రాష్ట్రాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశించింది. ఉగ్రవాదుల నుంచి అమర్నాథ్ యాత్రికులకు ముప్పు ఉందంటూ ప్రభుత్వం పేర్కొంది.













