ఒడిశా నూతన సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం

ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. నూతన సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్దాస్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్లోని జనతా మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.