సుప్రీంకోర్టు కీలక తీర్పు..అది ఓటరు హక్కేమీ కాదు
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల చరాస్తుల వెల్లడి అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అభ్యర్థులకు సంబంధించిన ప్రతీచరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ విధమైన సమాచారం తెలుసుకోవడం ఓటర్ల కచ్చితమైన హక్కేమీ కాదని స్పష్టం చేసింది. అత్యంత విలువైన ఆస్తులు ఉండి, విలాస వంతమైన జీవితం గడుపుతుంటే తప్ప, అభ్యర్థి, అతని కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు బహిర్గతం చేయాల్సిన పనిలేదని చెప్పింది. అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాలలో గోప్యత పాటించే హక్కు వారికి ఉందని పేర్కొంటూ 2019 లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తేజ ఎమ్మెల్యే కరిఖలో ఎన్నికను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. కరిఖో ఎన్నికపై ఆయన ప్రత్యర్థి లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది.













