సుప్రీంకోర్టు సీజే కీలక నిర్ణయం… ఇక నుంచి ప్రతి రోజు
పెండింగ్లో ఉన్న బెయిల్, బదిలీ పిటిషన్లను వేగవంతంగా విచారించేందుకు సుప్రీం కోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న 13 బెంచ్లు, ప్రతి రోజు కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే 10 బెయిల్, 10 బదిలీ (ట్రాన్స్పర్) పిటిన్లను విచారించాలని సూచించారు. క్రిస్మస్ నాటికి ఈ విభాగాల్లో పెండింగ్ పిటిషన్ల విచారణ పూర్తి చేయాలన్నారు. అందరు న్యాయమూర్తులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ఫర్ పిటిషన్లలో అత్యధికంగా కుటుంబ, వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. వీటిల్లో లిటిగెంట్లు సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతుంటారు. ఈ కేసుల్లో న్యాయ సంబంధమైన చిక్కులు పెద్దగా ఉండవు. కానీ, సుప్రీంకోర్టులో పెండిరగ్ పడిపోతాయి. ఈ నేపథ్యంలో సీజే చంద్రచూడ్ మాట్లాడుతూ 3,000 ట్రాన్స్ఫర్ కేసులు పెండిరగ్లో ఉన్నాయి. 13 బెంచ్ల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిత్యం 10 కేసులను విచారిస్త వారానికి 650 పూర్తి చేయవచ్చు. ఐదు వారాల్లో ట్రాన్స్ఫర్ పిటిషన్లు ముగిసిపోతాయి అని పేర్కొన్నారు.













