ఉక్రెయిన్ ఉగ్ర రూపం
ఉక్రెయిన్ ఉగ్ర రూపం ప్రదర్శించింది. ఉన్నంతలోనే రష్యాను ఎదురిస్తూ వస్తున్న ఉక్రెయిన్ తన డ్రోన్ దెబ్బ రుచిని రష్యాకు చూపించింది. క్రిమియాలోని కీలకమైన సెవస్తపోల్ సైనిక స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. 16 డ్రోన్లు ప్రయోగింంచి కీలకమైన యుద్ద నౌకలను ధ్వంసం చేసింది. భారీ నష్టం జరిగినప్పటికీ రష్యా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు అన్నింటినీ కూల్చేశామని, దాడులను తిప్పికొట్టామని ప్రకటించింది. ఈ దాడిలో ఒక నౌకకు మాత్రమే స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. రష్యాకు సెవస్తపోల్ చాలా కీలకం. నల్ల సముద్రంలో రష్యా నౌకా దళానికి ఇది ప్రధాన కేంద్రం. రష్యా ఇక్కడి నుంచి అటు అజోవ్ సముద్ర తీరాన్ని, ఇటు నల్ల సముద్ర తీర ప్రాంతాన్ని నియంత్రిస్తోంది. కాబట్టే 2014లో ఉక్రెయిన్కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకుని తన భూభాగంలో కలిపేసుకుంది.
ఉక్రెయిన్ సైనిక చర్య ప్రారంభించిన తరువాత రష్యా నౌకా దళం ఇక్కడి నుంచే తన దాడులు సాగిస్తోంది. రష్యాకు ఇంత కీలకంగా ఉన్న ఈ ప్రాంతంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించనప్పటికీ ఆ దేశ సైన్యం మాత్రం డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన మూడు యుద్ద నౌకలు ధ్వంసమైనట్లు తెలియజేసింది.













