గ్లోబల్ కంపెనీలు… భారత్ లీడర్లు
ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వేళ.. భారత్ లో నాగరికత వర్ధిల్లింది. ఆర్యభట్ట వరాహమిహిరుడు, సుశ్రుత, చరక , చాణక్యుడు సహా పలువురు శాస్త్రవేత్తలు.. భారతదేశంలో వైజ్ఞానిక జ్యోతులు వెలిగించారు. అది ఎంతలా సాగిందంటే.. విదేశాల నుంచి పలువురు వైజ్ఞానికులు .. ఇండియాకు వచ్చి, శాస్త్రాలపై అధ్యయనం సాగించారు. అంటే నాడు భారతదేశం.. వైజ్ఞానిక ప్రదేశంగా విలసిల్లింది. అదే సమయంలో వేదభూమిగానూ తన ప్రాశస్త్యతను కొనసాగించింది. తర్వాతి కాలంలో విదేశీ దండయాత్రలు, బ్రిటీష్ పాలనతో ఆ వైభవం కొడగట్టింది.
అయితే కొన్ని దశాబ్దాలుగా మళ్లీ భారత్ తన ప్రాభవాన్ని అందుకుంటూ వస్తోంది. ఇప్పటివరకూ వేదభూమిగా ఉండి, ప్రపంచగురుగా వర్దిల్లుతున్న భారతదేశం.. ఇప్పుడు ప్రపంచానికి తన నాయకత్వ పటిమను చవిచూపిస్తోంది. భారతీయుల నాయకత్వ సామర్థ్యం .. ప్రపంచం ప్రశంసలందుకుంటోంది. ఇప్పుడు ఏ అంతర్జాతీయ దిగ్గజం చూసినా.. భారతీయులను నాయకులుగా నియమించుకుంటోంది. దీంతో మరోసారి ప్రపంచయవనికపై.. భారత ధ్వజపతాక రెపరెపలాడుతోంది.
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. అడోబ్.. ఐబీఎం.. నోవార్టిస్.. డెలాయిట్.. స్టార్బక్స్.. బాటా.. యూట్యూబ్.. గోడాడీ.. మైక్రాన్.. ఫెడ్ఎక్స్.. డీబీఎస్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది లిస్ట్. వీటన్నింటిలోనూ కామన్ విషయం ఒకటుంది. అదేనండీ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో దుమ్మురేపుతున్న ఈ గ్లోబల్ కంపెనీలన్నింటినీ ఏలుతున్నది మనోళ్లే!
మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల, గూగుల్ -ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణన్, యూ ట్యూబ్ సీఈవో నీల్ మోహన్ సహా పలువురు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వీరి జాబితాలో మరికొందరు ప్రతిభావంతులు సైతం.. అతిపెద్ద కంపెనీలకు నేతృత్వం వహిస్తుండడం.. భారతీయులకు గర్వకారణంగా మారింది.
ఫార్చూన్-500 టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీల డ్రైవింగ్ సీట్లో ఉన్నది భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే!! అంటే మన కరెన్సీలో 492 లక్షల కోట్ల రూపాయలన్న మాట! మనదేశ ఎకానమీ (జీడీపీ) దాదాపు 3.2 లక్షలకోట్లడాలర్లతో పోలిస్తే రెట్టింపు విలువ వీటి సొంతం.
నీల్ మోహన్..Youtube CEO
యూ ట్యూబ్ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీకి కొత్త సీఈవోగా భారతీయ-అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నీల్ మోహన్ 2023లో ఎంపికయ్యారు. మార్చి 2008 నుండి నవంబర్ 2015 వరకు, మోహన్ Googleలో వీడియో ప్రకటనలపై పనిచేశారు. 2015లో నీల్ మోహన్ యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా నియమితులయ్యారు. YouTubeలో అనేక పెద్ద ప్రాజెక్ట్లకు మోహన్ నాయకత్వం వహించాడు. యూట్యూబ్ టీవీని యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ ప్రీమియం, షార్ట్లను ప్రారంభించడంలో నీల్ మోహన్ అతని బృందం కీలకపాత్ర పోషించారు.
నీల్ మోహన్ నెలవారీ జీతం దాదాపుగా 3.1 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.. ఇక యూట్యూబ్ నెట్ వర్త్ 183 బిలియన్ డాలర్లు ఉండొచ్చని వాణిజ్యవర్గాలు చెబుతున్నాయి.2023లో, YouTube యొక్క ప్రకటనల ఆదాయం Google యొక్క మొత్తం ఆదాయంలో దాదాపు 10.25 శాతంగా ఉంది. ఆ సంవత్సరం, వీడియో ప్లాట్ఫారమ్ యొక్క వార్షిక ప్రకటన రాబడి 29.24 బిలియన్ యు.ఎస్. డాలర్లకు చేరుకుంది, ఇది అంతకుముందు సంవత్సరంలో 28.84 బిలియన్ యు.ఎస్. డాలర్లుగా ఉంది.
అంజలి సూద్, TUBI TV CEO
ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది.అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
2022లో, సుడ్ $900,000 జీతం, బోనస్ మరియు $7 మిలియన్ల స్టాక్ అవార్డులతో సహా $8 మిలియన్ల ఆదాయాన్ని సంపాదించింది. 2021లో ఆమె $19 మిలియన్లను సంపాదించింది, ఇందులో $18 మిలియన్ల స్టాక్ అవార్డులు మరియు ఎంపికలు ఉన్నాయి.ఫాక్స్ 2020లో $440 మిలియన్లకు కొనుగోలు చేసిన Tubi, ఇప్పుడు 64 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులకు చేరుకుంది స్ట్రీమింగ్ వైపు లీనియర్ లో కొనసాగుతున్న మార్పును కంపెనీ నావిగేట్ చేయడంతో వ్యూహాత్మకంగా మారింది.గత ఏడాది ఫాక్స్ కొనుగోలు చేసిన ఉచిత యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ టుబి… 2022 నాటికి 700 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకున్నట్లు కొత్త యుబిఎస్ విశ్లేషించింది.
పునిత్ రెంజెన్.. Deloitte Global CEO
డిసెంబర్ 31, 2022 నుండి డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా పునిత్ రెంజెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.పర్పస్-లీడ్ సంస్థలపై దృఢ విశ్వాసం కలిగిన రెంజెన్ డెలాయిట్ యొక్క సిగ్నేచర్ CSR ప్రోగ్రామ్ వరల్డ్క్లాస్ను ప్రారంభించాడు, ఇది విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి ద్వారా వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విజయం సాధించడానికి 50 మిలియన్ల మందికి శక్తినిస్తుంది. వీరిలో 10 మిలియన్ల మంది భారతదేశంలోని మహిళలు మరియు బాలికలు. అతను డెలాయిట్ నాయకత్వ శ్రేణులలో వైవిధ్యం మరియు చేరికను మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తున్నాడు.
హర్యానాలో పుట్టిన పునీత్.. రోహ్ తక్ లో పెరిగారు. విల్లామెట్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్లో MBA సంపాదించిన తర్వాత, 1989లో బహుళజాతి సంస్థ డెలాయిట్లో విలీనం అయిన టచ్ రాస్చే నియమితులయ్యారు పునీత్. అప్పటి నుండి USలో నివసిస్తున్నారు. 2022లో పునీత్ నెట్ వర్త్ 7.5 మిలియన్ డాలర్లుగా ఉంది.డెలాయిట్ వార్షిక నివేదికల ప్రకారం FY2022లో సంస్థ US$59.3 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది, స్థానిక కరెన్సీలో 19.6% పెరుగుదల మరియు శ్రామికశక్తి ప్రపంచవ్యాప్తంగా సుమారు 415,000కి పెరిగింది. ఈ సంస్థ 175 ఏళ్ల చరిత్రతో పాటు 150 దేశాల్లో సేవలందిస్తోంది.
లీనా నాయర్ – Global CEO of Chanel
లీనా నాయర్.. బ్రిటీష్- ఇండియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్.గతంలో నాయర్ … యూనిలీవర్ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్గా మరియు యూనిలీవర్ లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేశారు. 190 దేశాలలో విస్తరించి ఉన్న యూనిలీవర్ యొక్క మానవ మూలధనానికి నాయర్ బాధ్యత వహించారు. ఆమె నాయకత్వంలో, యూనిలీవర్ 54 దేశాలలో ఫస్ట్ చాయిస్ FMCG గ్రాడ్యుయేట్ ఎంప్లాయర్గా పేరుపొందింది.
అలైన్ వర్థైమర్ ద్వారా చానెల్కు నియమించబడిన నాయర్, డిసెంబర్ 2021లో చానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే 100కి పైగా కంపెనీ రిటైల్ లొకేషన్లతో పాటు తయారీ సైట్లు మరియు ప్రాంతీయ కార్యాలయాలను సందర్శించారు. మరియు చానెల్ యొక్క క్రియేటివ్ డైరెక్టర్, వర్జీనీ వియార్డ్తో సహా ప్రముఖ ఫ్యాషన్ లీడర్లతో తనను తాను పరిచయం చేసుకుంది. 2022లో కంపెనీ పర్యావరణ-కేంద్రీకృత సౌందర్య సాధనాలు, అందం మరియు సువాసన లైన్, N°1 డి చానెల్ను పరిచయం చేసింది. చానెల్ టాప్ క్లయింట్ల కోసం నియమించబడిన తన ప్రైవేట్ సెలూన్లను కూడా విస్తరించింది.ఆమె నికర విలువ సుమారు $1.5 మిలియన్లు. ఆమె యూనిలీవర్లో 30 సంవత్సరాలు పనిచేసింది. జూన్ 2023లో కంపెనీ విడుదల చేసిన ఆర్థిక గణాంకాల ప్రకారం, చానెల్ 2022లో $17.2 బిలియన్ల నికర ఆదాయాన్ని కలిగి ఉంది.
థామస్ కురియన్ .. Google Cloud CEO
థామస్ కురియన్ నేతృత్వంలో గూగుల్ క్లౌడ్ గణనీయమైన ఫలితాలు సాధించింది. క్లౌడ్ లోకి థామస్ కురియన్ రావడానికి ముందుతో పోలిస్తే 2023లో 230 శాతం వృద్ధిరేటు నమోదైంది. గతేడాది నాటికి దీని ఆదాయం 23 బిలియన్ డాలర్లను మించి దూసుకెళ్లింది. గూగుల్ క్లౌడ్ లో వివిధ విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించిన కురియన్.. చివరకు సీఈవోగా మారారు.
గూగుల్ క్లౌడ్ యొక్క CEO అయిన థామస్ కురియన్ నికర ఆస్తి విలువ రూ. 15,000 కోట్లకు మించి ఉంటుందని అంచనా..Q12023లో కంపెనీ క్లౌడ్ ఆదాయాన్ని $7.4 బిలియన్లుగా నివేదించింది, ఇది సంవత్సరం క్రితం కాలంలో $5.8 బిలియన్ల నుండి 27.5% పెరిగింది. ఈ ఏడాది 191 మిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది. క్లౌడ్ మార్కెట్లో మూడో స్థానంలో నిలిచిన కంపెనీకి ఇది చాలా పెద్దది.
లక్ష్మణ్ నరసింహన్, Starbucks CEO
2022 సెప్టెంబర్ 1 నుంచి భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ నరసింహన్ గ్లోబల్ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఫౌండర్, ఫార్మర్ సీఈవో హోవర్డ్ స్కల్జ్ వారసుడిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.రిటైల్, గ్రోసరి, రెస్టారెండ్, ఈకామర్స్ రంగాల్లో లక్ష్మణ్ నరసింహన్ కు..మూడు దశాబ్దాలుగా అనుభవముంది. అంతేకాదు..బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన లిస్టులో వరుసగా ఏడోసారి అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచింది స్టార్ బక్స్. 2024 జనవరి నాటికి స్టార్ బక్స్ నెట్ వర్త్ విలువ 105 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక..2023 నాటికి లక్ష్మణ్ నరసింహన్ నికర విలువ సుమారు $23 మిలియన్ డాలర్లు.
లక్ష్మణ్ నరసింహన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూణే నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని మరియు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని లాడర్ ఇన్స్టిట్యూట్ నుండి జర్మన్ మరియు ఇంటర్నేషనల్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అతను ఫైనాన్స్లో MBA కోసం వార్టన్ స్కూల్ మరియు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు.లక్ష్మణ్ నరసింహన్ ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, రిటైల్, సాంకేతికత మరియు తయారీ వంటి బహుళ పరిశ్రమలలో పనిచేశారు. మెకిన్సే & కంపెనీలో 19 సంవత్సరాలు గడిపిన తర్వాత, అతను పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా చేరాడు.
సుందర్ పిచాయ్..Alphabet and Google CEO
మదురైలో పుట్టి, ఐఐటీ చదువుకున్న సుందర్ పిచాయ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆల్ఫాబెట్ ఇంక్, దాని అనుబంధ సంస్థ గూగుల్ ఎల్ఎల్సీకి సీఈఓగా నియమితులయ్యారు. 2004లో గూగుల్లో చేరిన సుందర్ పిచాయ్ దాదాపు పదేళ్లలోనే కంపెనీ టాప్ పొజిషన్కు చేరుకున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ డ్రైవ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ వంటి ప్రాజెక్టుల సక్సెస్కు సుందర్ పిచాయ్ దూరదృష్టి అపారమైన నైపుణ్యాలే కారణం. అంతేకాదు, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే గూగుల్ షేర్ ధర ఏకంగా 76 శాతం ఎగబాకడం విశేషం. ఆయన హయాంలోనే ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) తొలిసారిగా 2020 జనవరిలో ట్రిలియన్ (లక్షకోట్ల) డాలర్ల మైలురాయిని చేరుకోగా, 2021 నవంబర్లో 2 ట్రిలియన్ డాలర్లను సైతం తాకింది.
2019లో ఆయన నికర సంపద రూ.3,300 కోట్లుగా ఉండగా.. ప్రమోషన్ కారణంగా 242 మిలియన్ డాలర్లు సంపన్నంగా లభించాయి. ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 280.6 మిలియన్ డాలర్ల పారితోషికం తీసుకున్నారు. ఆ డబ్బులో ఎక్కువ భాగం – సుమారు 277 మిలియన్ డాలర్లు – స్టాక్ అవార్డుల రూపంలో వచ్చాయి. ఆల్భాబెట్ మార్కెట్ క్యాప్ లేదా నికర విలువ 1.78 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
సందీప్ కటారియా.. BATA CEO
నాణ్యమైన పాదరక్షల తయాీరీదారులు, రిటైలర్లలో ఒకటైన బాటా షూ ఆర్గనైజేషన్ సీఈవోగా సందీప్ కటారియా…నవంబర్ 30, 2020న నియమితులయ్యారు. పాదరక్షల తయారీ సంస్థకు సంబంధించి ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి స్థాయికి ఎదిగిన తొలి భారతీయుడు కటారియా కావడం విశేషం. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ పదవి నుంచి తప్పుకుంటున్న అలెక్సిస్ నాసర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కటారియాకు భౌగోళికంగా వివిధ ప్రాంతాలలో పనిచేయడంలో విస్తృతమైన నాయకత్వ అనుభవం ఉంది, బాటా కార్పొరేషన్ నికర విలువ జనవరి, 2024 నాటికి 135 మిలియన్ డాలర్లుగా ఉంది.
సత్యనాదెళ్ల… Microsoft CEO
తెలుగు తేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ను పోటీదారులకు అందనంత ఎత్తులో నిలబెట్టి ప్రపంచ కార్పొరేట్లలో తన రూటే సెపరేటు అని చూపించారు. ఎందుకంటే 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల.. 2019లో కంపెనీని తొలిసారి ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించేలా చేశారు. అజూర్క్లౌడ్ బిజినెస్తో భవిష్యత్తు దిశగా కంపెనీని నడిపించడమే కాదు.. 2021లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ దూసుకెళ్లేలా చేసిన ఘనత నాదెళ్లదే. తన హయాంలో 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు కనకవర్షం కురిపిస్తున్నాయి. వీటిలో లింక్డ్ఇన్, మోజాంగ్ (మైన్క్రాఫ్ట్ వీడియో గేమ్), న్యూయన్స్, గిట్ హబ్ వంటివి ఉన్నాయి.
అరవింద్ కృష్ణన్, IBM CEO
ఇక ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా, టాప్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న ఐబీఎం సారథిగా కూడా భారత్కు చెందిన అరవింద్ కృష్ణను నియమించడం విశేషం 2020 ఏప్రిల్ నుంచి ఐబీఎం సీఈవోగా, 2021 జనవరి నుంచి చైర్మన్ గా కొనసాగుతున్నారు. కృష్ణ 1990 లో IBM యొక్క థామస్ జె. వాట్సన్ రీసెర్చ్ సెంటర్ లో చేరాడు,మరియు 2009 వరకు 18 సంవత్సరాలు వాట్సన్ రీసెర్చ్ లో కొనసాగాడు. ఆ తర్వాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్లో జనరల్ మేనేజర్గా పనిచేశారు.ఆర్టిఫిలో ఐబిఎమ్ కు కొత్త మార్కెట్ల నిర్మాణం మరియు విస్తరణకు కృష్ణ నాయకత్వం వహించాడు.డిసెంబర్ 11, 2023 నాటికి అరవింద్ కృష్ణ నికర విలువ కనీసం 64.3 మిలియన్ డాలర్లు. కృష్ణ వద్ద 60,465,761 డాలర్ల విలువైన 33,328 యూనిట్ల ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ స్టాక్ ఉంది.2023లో ఐబీఎం ఆదాయం 10.5 బిలియన్ డాలర్లు గా ఉంది.
సంజయ్ మెహ్రోత్రా, Micron CEO
భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మరియు మైక్రాన్ టెక్నాలజీ సీఈవో. 2011 నుంచి 2016లో వెస్ట్రన్ డిజిటల్ కొనుగోలు చేసే వరకు శాన్ డిస్క్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా పనిచేశారు. తన కెరియర్లో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో వివిధ విభాగాల్లో పనిచేశారు సంజయ్. తన నైపుణ్యం, వినూత్న సృజనతో కంపెనీని విస్తరణ దిశగా పరుగులు పెట్టించారు. 2023 డిసెంబర్ నాటికి సంజయ్ ఆదాయం వంద మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 2023 నవంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో మైక్రాన్ టెక్నాలజీ ఆదాయం 4.726 బిలియన్ డాలర్లుగా ఉంది.
జార్జ్ కురియన్, NetApp / CEO
యాప్ దిగ్గజ సంస్థ నెట్ యాప్ సీఈవోగా జార్జ్ కురియన్ వ్యవహరిస్తున్నారు. నెట్ యాప్.. క్లౌడ్ ఆధారిత సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. దాన్ని తన నైపుణ్యం, మేధాశక్తి, అపార అనుభవంతో మరింత ముందుకు తీసుకెళ్లారు జార్జ్ కురియన్. సేవల రంగంలో సంస్థను అగ్రస్థానంలో నిలబెట్టారు కురియన్. ఇక నెట్ యాప్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ గా కురియన్ 9,491,210 డాలర్ల మూల వేతనం అందుకున్నారు.జనవరి 19, 2024 నాటికి నెట్ యాప్ మార్కెట్ క్యాప్ లేదా నికర విలువ 18.09 బిలియన్ డాలర్లు.
ఆమ్రపాలి గాన్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త
డిసెంబర్ 2021 లో, ఆమె ఓన్లీఫాన్స్ సిఇఒగా నియమితులయ్యారు, వ్యవస్థాపక సీఈవో్ టిమ్ స్టోక్లీ స్థానంలో వచ్చారు. అయితే 2023 జూలైలో ఆమె పదవి నుంచి వైదొలిగారు. ఆమ్రపాలి గన్ నికర విలువ 1 మిలియన్ డాలర్ల నుంచి 2 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.2023 నవంబర్ కు 3 మిలియన్ డాలర్లు సంస్థ నెట్ వర్త్..‘ఓన్లీ ఫ్యాన్స్’ సంస్థ లాభాలు గత ఏడాది కాలంలో విపరీతంగా పెరిగాయి. డివిడెండ్ల రూపంలో సంస్థ యజమాని 300 మిలియన్ డాలర్లు సంపాదించారు.
దేవికా బుల్చందానీ Ogilvy / CEO
న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి నాయకత్వం వహించిన మొదటి భారత సంతతి వ్యక్తి దేవికా . ఆమె ఇంతకు ముందు కంపెనీలో గ్లోబల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, 2022 సెప్టెంబర్లో కంపెనీ గ్లోబల్ సీఈఓగా నియమితులయ్యారు. ఆమె ఆదాయం 2-3 మిలియన్ డాలర్లు.సంస్థ ఆదాయం 2024 జనవరికి 25 మిలియన్ డాలర్లుగా ఉంది. వినూత్న అడ్వర్టైజింగ్ తో పాటు సంస్థ విస్తరణపైనా ఆమె దృష్టి సారించారు.. సంస్థను లాభాల్లో నిర్వహిస్తున్నారు.
శంతను నారాయణ్, Adobe Inc. CEO
శంతను నారాయణ్ మరియు అతని నాయకత్వ బృందం అడోబ్ యొక్క విజయవంతమైన పురోగతికి బాటలు వేసింది. సృజనాత్మక సాఫ్ట్వేర్ ఫ్రాంచైజీని డెస్క్టాప్ నుండి క్లౌడ్కు తరలించి, డిజిటల్ మార్కెటింగ్ వర్గాన్ని సృష్టించి, నడిపించింది. కంటెంట్ క్రియేషన్ మరియు డేటా కలిపి ఒక ఎండ్-టు-ఎండ్ ఆఫర్లోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు శంతను ..దీని ద్వారా శంతను నాయకత్వంలో అడోబ్ రికార్డు ఆదాయాన్ని మరియు విస్తృత పరిశ్రమ గుర్తింపును సాధించింది, ప్రస్తుతం శంతను ఆదాయం 325 మిలియన్ డాలర్లుగా ఉంది.
నీరజ్ షా, Wayfair CEO
2002 లో తన కార్నెల్ క్లాస్ మేట్ స్టీవ్ కోనిన్ తో కలిసి వేఫేర్ ను స్థాపించాడు. సంస్థ ప్రారంభం నుంచి సీఈవోగా ఉన్నారు. వివిధ దేశాల్లో ఈసంస్థకు ఫ్రాంచైజీలున్నాయి. వేలకోట్ల సామ్రాజ్యం నిర్మించారు 2024 జనవరి 8 నాటికి నీరజ్ షా నికర విలువ కనీసం 330 మిలియన్ డాలర్లు. జనవరి 26, 2024 నాటికి వేఫేర్ నికర విలువ 6.63 బిలియన్ డాలర్లు. 2013 సంవత్సరానికి గాను ఫార్చ్యూన్ జాబితాలో 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నారు.2017 నుంచి 2019 వరకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బోస్టన్ డైరెక్టర్గా పనిచేశారు.
రేవతి అద్వైతి, Flex CEO
55 ఏళ్ల రేవతి అద్వైతి 30 సంవత్సరాల క్రితం తన వృత్తిని ప్రారంభించినప్పుడు, తయారీ పరిశ్రమ ఈనాటి కంటే పూర్తిగా భిన్నమైన ఆకృతిలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫ్లెక్స్ సీఈవో మాట్లాడుతూ.. పరిశ్రమలో ఇప్పుడు కావాల్సిన నైపుణ్యాలు అప్పట్లో ఊహకు అందనివి అన్నారు.అద్వైతి ఫిబ్రవరి 2019లో CEO పాత్రను స్వీకరించారు మరియు వివిధ పరిశ్రమలు మరియు ముగింపు మార్కెట్లలో సాంకేతిక ఆవిష్కరణలు, సరఫరా గొలుసు మరియు బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన ఉత్పాదక పరిష్కారాలను చూపడంపై అద్వైతి ఫోకస్ పెట్టారు.
ఈమె కేవలం ప్రభావవంతమైన కార్పొరేట్ లీడర్ మాత్రమే కాదు, ఎంతో మందికి, ముఖ్యంగా స్టెమ్ లోని మహిళలకు మార్గదర్శి. భారతదేశంలో మూలాలున్న ఆమె ప్రపంచ స్థాయిలో తనదైన ముద్రవేసి, పనిప్రాంత వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ, సంకల్పం మరియు నైపుణ్యంతో సాధ్యమేనని నిరూపించారు. భారతదేశంలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అద్వైతి ప్రయాణం ప్రారంభమైంది. రేవతి అద్వైతి నెలకు రూ.10.9 కోట్లకు పైగా సంపాదిస్తోంది. రేవతి అద్వైతి నికర ఆస్తుల విలువ 36 నుంచి 54.5 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని సమాచారం.. జనవరి 19, 2024 నాటికి ఫ్లెక్స్ నికర విలువ 9.99 బిలియన్ డాలర్లుగా ఉంది.
రంగరాజన్ రఘురామ్…VMware CEO
జూన్ 1, 2021 నుంచి రఘురామ్ వ్యూహాత్మక బిజినెస్ లీడర్, ప్రస్తుతం వీఎంవేర్లో ప్రొడక్ట్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రఘురాం. భారతదేశంలో జన్మించిన 59 ఏళ్ల రఘు రఘురాం ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. 2021 మే 12న వీఎంవేర్ సీఈవో అయ్యారు. 2023 నాటికి రఘు రఘు రఘురాం నికర విలువ 70.6 మిలియన్ డాలర్లు.వీఎంవేర్ మార్కెట్ క్యాప్ లేదా నికర విలువ 61.52 బిలియన్ డాలర్లు. ఎంటర్ ప్రైజ్ వ్యాల్యూ 65.95 బిలియన్ డాలర్లు.
రాజేష్ సుబ్రమణ్యం… FedEx CEO
ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఫెడెక్స్ సీఈవోగా రాజేష్ సుబ్రమణ్యం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా కొరియర్, షిప్పింగ్ కార్యకలాపాల్లో సంస్థ పురోగతికి రాజేష్ ఎనలేని కృషి చేశారు.సుబ్రమణ్యం 1991లో ఫెడెక్స్ లో అసోసియేట్ మార్కెటింగ్ అనలిస్ట్ గా చేరారు. అతను త్వరగా ర్యాంకుల నుండి ఎదిగాడు మరియు ఆసియా మరియు యుఎస్ లో అనేక నిర్వహణ మరియు మార్కెటింగ్ పాత్రలను నిర్వహించాడు. 2018 చివరిలో, అతను ఫెడెక్స్ యొక్క వారసత్వ ఎక్స్ప్రెస్ యొక్క సిఇఒగా పదోన్నతి పొందాడు. రాజేష్ సుబ్రమణ్యం నికర విలువ: 2023-12-30 నాటికి 24 మిలియన్ డాలర్లు.
నికేష్ అరోరా, Palo Alto Networks CEO
పాలో ఆల్టో మిస్టర్ నికేశ్ అరోరా నాయకత్వంలో $100 బిలియన్ల సైబర్ సెక్యూరిటీ కంపెనీని తయారు చేయాలని ఆశిస్తోంది. అతని మార్గదర్శకత్వంలో వ్యాపారం మూడు సంవత్సరాల కాలంలో $ 27.8 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదలను చూసింది, $3.6 బిలియన్లను వాటాదారులకు తిరిగి ఇచ్చింది మరియు FY 2022లో $ 5.5 బిలియన్ల రికార్డు అమ్మకాలను సాధించింది. నికేశ్ అరోరా అరుదైన నాన్-ఫౌండర్ బిలియనీర్ టెక్ సీఈఓ. అతని చివరి మూడు స్థానాల్లో-గూగుల్లో ప్రారంభించి, సాఫ్ట్బ్యాంక్కు వెళ్లి, పాలో ఆల్టోలో ముగిసే వరకు-అతను వాల్ స్ట్రీట్లో అత్యధికంగా పరిహారం పొందిన ఎగ్జిక్యూటివ్ అయ్యాడు మరియు ప్రపంచంలోనే అత్యధికంగా పరిహారం పొందిన ఉద్యోగులలో ఒకడు.పాలో ఆల్టో నెట్వర్క్స్ ఇంక్ సీఈఓ, చైర్మన్ నికేష్ అరోరా 1.5 బిలియన్ డాలర్ల నికర విలువతో బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లోకి ప్రవేశించారు. ఇక సంస్థ నికర ఆదాయం 2023 జులై నాటికి 75.69 బిలియన్ డాలర్లు.
వివేక్ శంకరన్, Albertsons CEO
భారతదేశంలోని నిరాడంబరమైన మూలాల నుంచి వచ్చిన శంకరన్ $11.5 బిలియన్ల (రూ. 95,000 కోట్లకు పైగా) మార్కెట్ క్యాప్తో కిరాణా దుకాణం దిగ్గజం ఆల్బర్ట్సన్కు CEO అయ్యారు. ఫార్చ్యూన్ 500 కంపెనీకి నాయకత్వం వహించిన మాజీ పెప్సీ కార్యనిర్వాహకులలో ఒకరైన శంకరన్ 2019లో ఆల్బర్ట్సన్స్కు బయలుదేరినప్పుడు పెప్సికో ఉత్తర అమెరికా CEOగా ఉన్నారు. చైన్ షాప్స్ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. సంస్థ అత్యున్నత అభివృద్ధికి కృషి చేశారు వివేక్.2023 ఫిబ్రవరి 27 నాటికి కనీసం 54.8 మిలియన్ డాలర్లు.. వివేక్ నికరాదాయంగా ఉంది.













