చైనా మరో ఘనత.. అగ్రరాజ్యం సరసన

అంగారక యాత్రలో చైనా ఘనత సాధించింది. అగ్రరాజ్యం అమెరికా సరసన చైనా చేరింది. డ్రాగన్ దేశానికి చెందిన జురాంగ్ రోవర్ మార్స్ గ్రహంపై దిగింది. ఆరు చక్రాలు ఉన్న రోబోను విజయవంతంగా దించినట్లు చైనా పేర్కొన్నది. అంగారక గ్రహంపై ఉన్న ఉతోపియా శ్రేణులను టార్గెట్ చేస్తూ ఈ రోవర్ను లాంచ్ చేశారు. ఉత్తర ధ్రువం వద్ద ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో రోవర్ను ల్యాండ్ చేయడం అసాధారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం అమెరికా మాత్రమే మార్స్ గ్రహంపై తన రోవర్ను ల్యాండ్ చేసింది.
జురాంగ్ రోవర్ విజయవంతంగా దిగిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆ విషన్ బృందానికి కాంగ్రాట్స్ తెలిపారు. గ్రహాన్వేషణలో అగ్రపథంలో నిలిపినట్లు ఆయన వారిని కీర్తించారు. బీజీంగ్ కాలామానం ప్రకారం శనివారం ఉదయం 7:18 నిమిషాలకు రోవర్ ల్యాండ్ అయ్యింది. రోవర్ దిగిన 17నిమిషాల తర్వాత దాని సోలార్ ప్యాలెన్స్ తెరుచుకున్నాయి. ఆ తర్వాత అది భూమికి సిగ్నల్స్ పంపింది. ఇప్పటి వరకు అంగారకుడిపై రోవర్లను అమెరికా, రష్యాలు మాత్రమే పంపగా, ఇప్పుడు వాటి సరసన చైనా చేరింది.