కిలిమంజారోపై తొమ్మిదేండ్ల బాలిక
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి రిత్విక ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరంగా ఖ్యాతిగాంచిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఫొటోను చిన్నారి ప్రదర్శించింది. కాగా, తాడిమర్రి మండలం ఎ.అగ్రహానికి చెందిన కడపల శంకర్ కుమార్తె రిత్విక.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా అరుదైన రికార్డుకు దూరమవుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు ఎస్పీ కార్పొరేషన్ ద్వారా రూ.2,98,835 ఆర్థిక సాయాన్ని అందేలా చేశారు. రికార్డుల సాధనకు బయలుదేరిన చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన కలెక్టర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకోవడం విశేషం.













