కెనడా-అమెరికా సరిహద్దులో.. నలుగురు భారతీయులు
భారత దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు కెనడా, అమెరికా సరిహద్దు ప్రాంతంలో మృతి చెందినట్లు ఆ దేశ సరిహద్దు అధికారులు గుర్తించారు. వెంటనే భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో పసిపాప కూడా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన జైశంకర్ ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారత రాయబారారులను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారిని గుర్తించాలని, అదే విధంగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.













