తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కొవిడ్తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,151 ఉండగా, వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి.