కరోనా టీకా తీసుకున్న సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మే 16న రాహుల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే రాహుల్ కరోనా బారిన పడ్డారు అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. సోనియా గాంధీ మాత్రం తన రెండో మోతాదులను తీసుకున్నారని తెలిపారు. రాహుల్ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత టీకా తీసుకుంటారని పేర్కొన్నారు. కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్షించిన వారు పూర్తిగా కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.