రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. నాలో స్వల్ప స్థాయిలో లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. తనతో ఇటీవల కాంటాక్ట్లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని రాహుల్ కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కొవిడ్ టీకాల పంపిణీపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో రాహుల్ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్లో జరగాల్సిన చివరి మూడు దశల ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పిన విషయం తెలిసిందే.