3 కోట్ల కరోనా యోధులకు తొలిదశలో వ్యాక్సిన్ – మోదీ

కోవిడ్ టీకాను తొలిదశలో మూడు కోట్ల మంది హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభమవుతుందని.. టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరిస్తుందని మోడీ, కరోనా సంక్షోభ సమయంలో అందరూ ఒక్కటై పనిచేశారని.. మిగతా దేశాలకన్నా భారత్లో కరోనా వ్యాపించలేదని అన్నారు.
తొలి దశలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు ఈ టీకా ఇస్తామన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు ఉండబోరని మోడీ స్పష్టం చేశారు. రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యతనిస్తామన్నారు. జూలై నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ ఖర్చంతా కేంద్రప్రభుత్వమే భరిస్తుందని.. రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.