కరోనా బారిన పడిన మాజీ ముఖ్యమంత్రి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. లక్షణాలు ఏమైనా ఉంటే స్వతహాగా ఐసోలేషన్లోకి వెళ్లండి అని విజ్ఞప్తి చేశారు. బసవ కళ్యాణ్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా ఆ అభ్యర్థి తరపున గత కొన్ని రోజులుగా కుమారస్వామి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కాగా కుమారస్వామి మార్చి 23న కరోనా టీకా తొలిడోసు వేయించుకున్నారు.