రెండో డోసు తీసుకున్న కమలాహ్యారిస్

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కరోనా టీకా రెండవ డోసు తీసుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆమె టీకా వేసుకున్నారు. మోడెర్నా సంస్థకు చెందిన కోవిడ్ టీకా డోసులను ఆమె తీసుకున్నారు. అమెరికన్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు. సీ-స్పాన్ టీవీ లైవ్లో టీకా తీసుకున్న ఆమె.. టీకా మీ జీవితాలను రక్షిస్తుందని అన్నారు. డిసెంబర్ 29వ తేదీన కమలా హ్యారిస్ తొలి డోసు టీకాను తీసుకున్నారు. వాషింగ్టన్లోని యునైటెడ్ మెడికల్ సెంటర్లో ఆమె ఆ టీకా వేయించుకున్నారు. ప్రస్తుతం అమెరికా రెండు కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్నారు. గత వారం రోజుకు పది లక్షల మంది టీకాలు ఇస్తున్నారు. వంద రోజుల పాలన పూర్తి అయ్యేలోగా సుమారు పది కోట్ల మందికి కరోనా ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసింది.