దేశంలో సెకండ్ వేవ్ విజృంభణ.. 24 గంటల్లో భారీగా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. వరుసగా ఐదోరోజు మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,73,810 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం 1,619 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి పెరిగింది. కొత్తగా 1,44,178 మంది వైరస్ నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821 కు పెరిగింది. రికవరీ రేటు 86.62 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 19,29,329కి పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ పక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12.30 లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 12,38,52,56కి చేరింది.