దేశంలో కాస్త కనికరించిన కరోనా….

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఒక రోజు తక్కువగా నమోదు అవుతుంటే, మరో రోజు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 20,55,010 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..2,76,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో కొత్తగా 3,874 మంది మరణించారు. దీంతో మొత్తం 2,87,122 మంది బాధితులు మరణించారు. తాజాగా 3,69,077 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400కు చేరాయి. ఇప్పటి వరకు 2,23,55,440 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 18,70,09,792 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.