దేశంలో కరోనా తగ్గుముఖం… 24 గంటల్లో

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 21,57,857 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,11,298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు వదిలారని చెప్పింది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,46,33,951గా ఉంది. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 3,15,235 మంది ప్రాణాలను కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 24,19,907 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు టీకా డ్రైవ్లో 20,26,95,874 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.