దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా…

భారత్లో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3,26,098 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 3,53,299 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. మరణాల సంఖ్య 2,66,207కు పెరిగింది. మొత్తం 2,04,32,898 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 36,73,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 18,04,57,579 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది.